ఆత్మకూరు.ఎస్, ఫిబ్రవరి 26 : ముందస్తు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అని ఆత్మకూరు.ఎస్ ఎస్ఐ బి.శ్రీకాంత్ గౌడ్ అన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతలో భాగంగా గురువారం మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు నియమాల పట్ల ప్రజలకు సూచనలు చేశారు. అధిక వేగం, మద్యం మత్తులో, తప్పుడు మార్గంలో వాహనాలు నడపవద్దన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. వాహన పరిమితికి మించి ప్రయాణికులను, వస్తువులను రవాణా చేయకూడదని, రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపరాదరని ఎస్ఐ పేర్కొన్నారు.