తుంగతుర్తి: అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుంగతుర్తి పట్టణ కేంద్రానికి చెందిన బీజేపీ ఉపాధ్యక్షుడు ఇరుగు సురేశ్ బీజేపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బీరపూల నారాయన, నాయకులు బొజ్జ గిరి, గోపగాని శ్రీను, నజీర్ తదితరులు పాల్గొన్నారు.