నల్లగొండ : నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నకిరేకల్ బైపాస్ రోడ్డలో వందలాది మంది కార్యకర్తలు కవితకు స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తోడ్కొని వెళ్లారు.
అక్కడ కార్యకర్తలు, అభిమానులను కవిత ఆప్యాయంగా పలుకరించారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళ కౌన్సిలర్లతో మాట్లాడారు. అనంతరం అక్కడ నుంచి సూర్యాపేట జిల్లా మునగాలలో ప్రముఖ చరిత్రకారుడు కూర జితేంద్రబాబును పరామర్శించేందుకు వెళ్లారు. జితేంద్రబాబు తండ్రి ఇటీవల మరణించారు. కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, తదితరులు ఉన్నారు.