ప్రకటించారు. ఈ మేరకు ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఇందులో పురుషులు 4,62,644, మహిళలు 4,71,729, ఇతరులు 29 మంది ఉన్నారు. కొత్తగా 20,211 మంది ఓటర్లు పెరిగారు. అధికారులు సెప్టెంబర్ 19 వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను వెల్లడించనున్నారు.
సూర్యాపేట, ఆగస్టు 23 : సూర్యాపేట జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 9,34,402 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక ఆర్డీఓ కార్యాలయాలు, తాసీల్దార్ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 19 వరకు అభ్యంతరాలను స్వీకరించి అక్టోబర్ 4న జిల్లా తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ముసాయిదా జాబితాలో 20,211 మంది కొత్త ఓటర్లు పెరిగినట్లు ప్రకటించారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓట హక్కు కలిగి ఉండాలనే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టి ముసాయిదా జాబితాను విడుదల చేసింది.
ఈ నెల 21 జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. సూర్యాపేట జిల్లాలోని 4 నియోజక వర్గాల పరిధిలోని 26 మండలాల పరిధిలో 1,168 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 9,34,402 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. జిల్లాలో పురుష ఓటర్లు 4,62,644 మంది ఉండగా మహిళా ఓటర్లు 4,71,729 మంది ఉన్నారు. ఇతరులు 29 ఉండగా వీరందరూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. జిల్లాలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. దాదాపు 9,085 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 1న ఓటర్ల జాబితా విడుదల చేయగా ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా ముసాయిదా జాబితాను విడుదల చేయడం జరిగింది. తుది జాబితాను అక్టోబర్ 4న విడుదల చేయనున్నారు.
కొత్త ఓటర్లు 20,211 మంది..
ఈ ఏడాది జనవరి 1న రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో జిల్లా వ్యాప్తంగా 9,14,191 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఇటీవల ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన నూతన ఓటర్ల చేరిక, మార్పులు, మరణించిన ఓటర్లను జాబితా నుంచి తొలగింపు చేసిన తర్వాత ఈ నెల 21న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో జిల్లా ఓటర్ల సంఖ్య 9,34,402 మంది ఉన్నారు. దాదాపు 20,211 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. పెరిగిన ఓటర్లలో పురుష ఓటర్లు 10,274 మంది ఉండగా మహళా ఓటర్లు 9,931 మంది ఇతరులు 6. హుజూర్నగర్ నియోజక వర్గంలో 6,966 మంది, కోదాడ నియోజకవర్గంలో 4,692, సూర్యాపేట నియోజకవర్గంలో 3,802, తుంగతుర్తి నియోజకవర్గంలో 7,751 ఓట్లు పెరగడం జరిగింది.
అక్టోబర్ 4న తుది జాబితా..
ఆగస్టు 21న ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితాను జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ, తాసీల్దార్, గ్రామ పంచాయతీ భవనాలు, పట్టణం, గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాల వద్ద, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించనున్నారు. ఈ ఓటర్ల జాబితాలో ఓటు లేనివారు ఫామ్-6 ద్వారా సంబంధిత పోలింగ్ బూత్ సిబ్బంది, తాసీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలి. జాబితాలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే సంబంధిత ఫామ్లను అధికారులకు ఇవ్వాల్సి ఉటుంది. సెప్టెంబర్ 19 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఓటు వివరాలను nvsp.in పోర్టల్లో పరిశీలించుకోవచ్చును. అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. తుది జాబితాలో ఓటు హక్కు ఉన్నవారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.