వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 92 శాతం పూర్తయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెల రోజులుగా అధికార యంత్రాంగం బిజీగా ఉన్నప్పటికీ ఆటంకం లేకుండా కొనుగోళ్లు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
ఈ సారి బహిరంగ మార్కెట్లో ధాన్యానికి మద్దతుకు మించి ధర ఉండడంతో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ప్రస్తుతం 1.80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయి. మరో 20 వేల మెట్రిక్ టన్నులను వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు రైతులకు ధాన్యం డబ్బులు రూ.400 కోట్లకుగానూ రూ.290 కోట్లు బ్యాంక్ ఖాతాల్లో జమయ్యాయి. ఆన్లైన్ ప్రక్రియ పూర్తికాగానే మిగతా డబ్బులు కూడా ఎప్పటికప్పుడు పడనున్నాయి.
సూర్యాపేట జిల్లాలో వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను అధికార యంత్రాంగం 90 శాతం పూర్తి చేసింది. ఎన్నికల నేపథ్యంలో అధికార యంత్రాంగం గత నెల రోజులుగా బిజీగా ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకం కలుగకుండా జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ చొరవ తీసుకున్నారు. జిల్లాలో వానకాలం సీజన్కు సంబంధించి సుమారు 4.50 లక్షల ఎకరాలు సాగు చేయగా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుండగా బహిరంగ మార్కెట్లో ఈ సారి ధరలు అధికంగా ఉండడంతో రైతులు అటువైపు మొగ్గు చూపారు.
జిల్లాలో ఈ సీజన్కు సంబంధించి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 1.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మరో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పంట పొలాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉంది. ఇప్పటి వరకు రూ.400 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా 290 కోట్ల రూపాయలు రైతులు అక్కౌంట్లలో వేశారు. మరో 110 కోట్లకు సంబంధించి ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో నాగార్జునసాగర్, కాళేశ్వరం, మూసీ నదుల పరిధిలోని సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టులో రైతులు వరి ధాన్యం పండించారు. గత నెల రోజులుగా ధాన్యం దిగుబడి వస్తుండగా ఎన్నికల బిజీలో అధికార యంత్రాంగం బిజీగా ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం కలుగకుండా జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ చర్యలు తీసుకున్నారు.
ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ చివరి వారంలో 274 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా.. ఇప్పటి వరకు 20 సెంటర్లలో పూర్తి కాగా వాటిని క్లోజ్ చేశారు. మరో 60 శాతం సెంటర్లలో 2 నుంచి 5 లారీల ధాన్యం ఉంది. ప్రభుత్వం రైతులకు చెల్లించే మద్దతు ధర క్వింటా ఒక్కంటికి రూ.2,203 ఉండగా.. ఈసారి బహిరంగ మార్కెట్లో ధర అధికంగా ఉండడంతో రైతులు అటువైపే మొగ్గు చూపారు. బహిరంగ మార్కెట్లో గ్రేడ్-1 రకం క్వింటాకు రూ.3,200 నుంచి 3,500 వరకు పలికింది. దాంతో రైతులు బహిరంగా మార్కెట్లోనే ఎక్కువగా విక్రయించారు.
జిల్లాలో రైతులు పండించిన పంటను దాదాపు 90 శాతం మేర సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. అయితే బహిరంగ మార్కెట్లో ధరలు అధికంగా ఉండడంతో ఈసారి 2 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు ఇప్పటికే 1.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.
మరో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పంట పొలాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉంది. ఇప్పటి వరకు రూ.400 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయగా, రూ.290 కోట్లను రైతులు అక్కౌంట్లలో వేశారు. మరో 110 కోట్లకు సంబంధించి ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సివిల్ సప్లయ్ శాఖ జిల్లా మేనేజర్ రాంపతినాయక్ తెలిపారు. మొత్తం మీద వారం నుంచి పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.