నల్లగొండ రూరల్, డిసెంబర్ 21: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఈడబ్ల్యూడీసీ (విద్యా, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన ఊరు – మన బడి పనుల అభివృద్ధిపై కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవనంలో బుధవారం ఇంజినీరింగ్, జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పనుల అభివృద్ధి, సాంకేతిక విషయాలపై తగిన సూచనలు ఇచ్చారు. ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఈఓ భిక్షపతి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 517 పాఠశాలల్లో మన ఊరు మన బడి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ తిరుపతయ్య, ఆర్అండ్బీ ఈఈ రామచంద్రం, డీఈలు శైలజ, శివ, రమేశ్ పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాలలో భవన నిర్మాణ పనుల పరిశీలన
నల్లగొండ పట్టణంలో నిర్మిస్తున్న నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను ఈడబ్ల్యూడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి బుధవారం రాత్రి పరిశీలించారు. కార్యక్రమంలో రావుల శ్రీనివాస్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.