Minister KTR | స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ప్రారంభం కాగా మరికొన్నింటికి శ్రీకారం చుట్టేందుకు మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. ఒకేసారి 51 పరిశ్రమలతోపాటు కామన్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించనున్నారు. 100 ఎకరాల్లో టాయ్స్పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలకు స్థలాల కేటాయింపు పత్రాలను అందజేస్తారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా ఇండస్ట్రియల్ పార్కులో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
చౌటుప్పల్ : మండలంలోని దండు మల్కాపురం లో మంగళవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉదయం 9.30 గంటలకు పర్యటించనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన ఇక్కడకు రానున్నారు. ఈ సందర్భంగా పార్కులోని 51 పరిశ్రమలను, స్కిల్ డెవలప్మెంట్, కామన్ ఫెసిలిటీ, సేవజ్ ట్రిట్మెంట్ ప్లాంటు, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ కార్యాలయం(ఐలా), తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య(టీఫ్) తదితర కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు. ఆనంతరం 100 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న టాయ్స్ పార్క్కు శంకుస్థాపన చేస్తారు. అలాగే 12 మంది పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయింపు పత్రాలను అందజేస్తారు. ఉత్పత్తులు సిద్ధ్దంగా ఉ న్న 51 పరిశ్రమలకు సంబంధించి ఒకేచోట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పారిశ్రామిక వేత్తల సమావేశమై ముచ్చటిస్తారు.
40 వేల మందికి ఉద్యోగాలు
కాగా పరిశ్రమలు ఏర్పాటు చేసిన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం 2019 తెలంగాణ పారిశ్రామికవేత్తల ఫెడరేషన్ (టీఐఎఫ్) ఆధ్వర్యంలో ఈ పార్క్ను ఏర్పాటు చేసింది. 542 ఎకరాల్లో 400 పైగా పరిశ్రమల ఏర్పాటు కొనసాగుతున్నది. మూడు దశల్లో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం ముందుకు సాగింది. ఈ క్రమంలో సుమారు 4 ఏండ్లలోనే పార్క్ను లక్ష్య దిశగా అడుగులు పడ్డాయి. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 40 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే సుమారు 2 నుంచి 3 వేల మంది ఉపాధి పొందుతున్నారు. దీనికి తోడు 5 ఎకరాల స్థలంలో 2 లక్షల స్కోర్ ఫిట్తో సుమారు రూ.40 కోట్లతో కామన్ ఫెసిలిటీ ఈ కేంద్రాన్ని 2021 జనవరి 22న శంకుస్థాపన చేశారు. దాదాపు ఏడాదిన్నరలోనే యుద్ధ్ద ప్రతిపాదికన పనులు చేపట్టి బహుళ అంతస్తులు నిర్మించారు. ఈ సెంటర్ను రెండు బ్లాకులుగా నిర్మిస్తున్నారు. రెండు భవనాలను ఐదు అంతస్తులుగా నిర్మిస్తున్నారు. మొదటి బ్లాకు భనంలో సమావేశ మందిరాలు, నైపుణ్య శిక్షణ కేంద్రం, అడిటోరియం, ఐలా, టీఫ్ కార్యాలయాలు, రెస్టారెంట్ల, బ్యాంకులను నిర్మాణం చేశారు. రెండో భవనంలో వస్తువులను ప్రదర్శన చేసేందుకు ప్రత్యేక మార్కెట్తోపాటు, కార్యాలయాలు, వసతి గదులు, ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పనులు పూర్తయ్యాయి.
శంకుస్థాపన చేసే పరిశ్రమలు ఇవే..
పార్క్లో ఇప్పటికే 51 పరిశ్రమలు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని పరిశ్రమలు పనులు పూర్తయై త్వరలోనే ఉత్పత్తులు కొసాగించున్నాయి. ఉత్పత్తులు ప్రారంభించే పరిశ్రమల్లో రక్షణ పరికరాల తయారీ, సోడామిషన్ మేకింగ్, ఎర్త్ డ్రిల్లింగ్ ఎక్విఫ్మెంట్, మైనింగ్,బిస్కెట్లు, చాకెట్లు,కుర్కురే, పచ్చళ్లు, ప్లాస్టిక్ కుర్చీలు, బిల్డింగ్ మెటీరియల్స్, ప్యాకింగ్ బ్యాగులు, మిల్క్క్యాన్ల తయారీ, కేబుల్స్, సిమెంట్ బిక్స్, టెక్ట్స్బుక్కుల ప్రిటింగ్, పేవ్మెంట్ టైల్స్, మౌల్డింగ్ తయారీ, ప్యాకింగ్ ప్రిటింగ్, కూలర్ల బాడీ, పెట్రోల్ బంకుల నిర్మాణ పరిశ్రమ, ఆటోమేటిక్ రైస్ గ్రైడింగ్, ప్లాస్టింగ్ ప్యాకింగ్, మెటీరియల్, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, యూపీవీసీ విండోస్ పరిశ్రమలు ప్రధానంగా ఉన్నాయి.