దేవరకొండ, ఫిబ్రవరి 6 : సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు అన్ని రాష్ర్టాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ మండలంలోని కొండభీమనపల్లి గ్రామానికి చెందిన 50 మంది వివిధ పార్టీల నాయకులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఇతర రాష్ర్టాల సీఎంలు వచ్చి మన పథకాలను పరిశీలించి వెళ్తున్నారన్నారు. 75 ఏండ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీలు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాకే సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు పోతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేశ్గౌడ్, రైతు విభాగం మండలాధ్యక్షుడు మునుకుంట్ల వెంకట్రెడ్డి, నాయకులు కడారి సైదులు, తిరుపతయ్య, నేనావత్ కల్యాణ్, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
ఐదు ఆరోగ్య ఉప కేంద్రాలకు రూ. కోటి మంజూరు
నియోజకవర్గంలోని ఐదు ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలోని పడ్మట్పల్లి, దేవరకొండ, డిండి మండలంలోని చెరుకుపల్లి, చందంపేట మండలంలోని కంబాలపల్లి, పీఏపల్లి మండలంలోని గుడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఒక్కో కేంద్రానికి రూ.20లక్షల చొప్పున మంజూరైనట్లు చెప్పారు. ఈ ఆరోగ్య ఉపకేంద్ర భవనాల నిర్మాణానికి త్వరలో టెండర్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆరోగ్య ఉప కేంద్రాలకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావ్కు ఎమ్మెల్యే కృతజ్జతలు తెలిపారు.