బీబీనగర్, డిసెంబర్ 30 : మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపికను శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. గ్రామస్తుల సమక్షంలో 36 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లకు 350 దరఖాస్తులు రాగా అధికారులు పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేశారని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీవాణి, తాసీల్దార్ అశోక్రెడ్డి, ఉపసర్పంచ్ దస్తగిరి, వార్డు సభ్యులు, నాయకులు అంజనేయులు శర్మ, పంజాల పెంటెయ్య, మంగ లింగేశ్, సామల వేణు, నెల్లూట్ల శ్రీశైలం, పొట్ట అంజి, ఎండీ మొయీన్, మస్తాన్, ఎలుగల పరేందర్, నరేశ్, పొట్ట నవీన్ పాల్గొన్నారు.