కామారెడ్డి, మే 9 : జిల్లాకేంద్రంలో మూడున్నర కోట్ల రూపాయలతో అధునాతన హంగులు, అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మిస్తున్నా మని స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు వద్ద కొనసాగుతున్న వైకుంఠధామం పనులను ఆయన స్థానిక నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. వైకుంఠధామం వరకు రోడ్డు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు చెప్పారు. వైకుంఠధామం వద్ద స్నానపు గదులు, నీటి వసతి కోసం ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు నిట్టు వేణుగోపాల్రావు, కృష్ణమోహన్, ముప్పారపు ఆనంద్ తదితరులు ఉన్నారు.