రామగిరి, జూన్ 27 : గ్రూప్ -4 పరీక్షకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు పర్యాయాలు ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్, పరిశీలకులు, రూమ్ అధికారులు, నోడల్ అధికారుల ఇతర అధికారులు, సిబ్బందితో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి పరీక్షల నిర్వహణపై సూచనలు చేశారు. ఈనెల 28న అన్ని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్తో ఉదయం జూమ్యాప్లో సమావేశం సహితం నిర్వహించి పరీక్షల ఏర్పాట్లును పర్యవేక్షణ చేయనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 53,123 మంది అభ్యర్థులు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ -4 పరీక్షలకు 53, 123 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరికోసం 188 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రతి అభ్యర్థి వేలిముద్రల సేకరణ..
పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల వేలిముద్రను తప్పని సరి చేసింది. నామినల్ రోల్లో సంతకం తరువాత ఎడమచేతి బొటన వేలిముద్ర కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించింది. ప్రతి సెషన్ పరీక్ష ముగిశాక ఓఎంఆర్ షీట్ను ఇన్విజిలెటర్కు అందచేసి వేలిముద్ర వేయాలి. అర గంట కోసారి అభ్యర్థులకు సమయాన్ని గుర్తిచేస్తూ బెల్ మోగిస్తారు. పరీక్ష ముగియడానికి 5 నిమిషాల ముందు బెల్ మోగిస్తారు. వీటి పరిశీలన చేస్తూ అభ్యర్థులు పరీక్షల రాయాల్సి ఉంటుంది.
ఓఎంఆర్ షీట్ను పూర్తిచేయండిలా..
పరీక్ష హాల్లో ఓఎంఆర్ పత్రంలో సమాధానాలు పూర్తి చేయడానికి బ్లూ/ బ్లాక్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఓఎంఆర్లో పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబర్ను రాయాలని కమిషన్ తెలిపింది. హాల్ టికెట్, ప్రశ్న పత్రం నంబర్ సరిగా రాయకున్నా, బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్కాకుండా ఇంక్ పెన్న,జెల్ పెన్ను, పెన్సిల్ ఉపయోగించిన ఓఎంఆర్ పత్రం చెల్లుబాటుకాదు.
పరీక్షల నిర్వహణ సమయం
గ్రూప్ -4 పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో ఉంటుంది. పేపర్ -1(జనరల్ స్టడీస్) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటిఎస్) మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే నిర్ణత సమయం కంటే 15 నిమిషాల ముందుగానే ఆయా పరీక్ష కేంద్రాల గేట్లు ముసివేస్తారు. తదుపరి ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోని అనుమతించారు. పేపర్ -1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్ -2 మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కేంద్రంలోకి అభ్యర్థులను అనుతిస్తారు. పరీక్ష హాల్లోకి వచ్చిన తర్వాత ఇన్విజిలేటర్ అభ్యర్ధి గుర్తింపుకార్డు చూపించాలి.
వీటిని అనుమతించరు
అభ్యర్థుల వెంట ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులు తీరుకునిరావద్దు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించి రావాలి. షూ వేసుకోవద్దు. షూ వేసుకుని వస్తే పరీక్ష కేంద్రం వెలుపలనే వదిలి వేయాలి.