కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్లగొండ, జూలై 15 : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న గొట్టిముక్కల, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్లతోపాటు ఏఎమ్మార్పీ ప్రాజెక్టులోని పెండ్లిపాకల, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్తో కలిసి సాగునీటి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవటంతో పనుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని సంబంధిత యంత్రాంగం పరిహారం అందజేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో జగదీశ్వర్రెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్ఈ ఆనంద్, ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ ఎస్ఈ అజయ్కుమార్, పీఆర్ ఎస్ఈ ప్రకాశ్, దేవరకొండ ఆర్డీఓ గోపీరాం, యూనిట్ వన్ ఎస్డీసీ జగన్నాథరావు, ఆర్అండ్ఆర్ ఎస్ఈ రాజశేఖర్ పాల్గొన్నారు.