నెట్వర్క్ నమస్తే తెలంగాణ, మార్చి 18 : పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు, సంస్కృతం పరీక్షలు జరిగాయి. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షకు అనుమతించారు. ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరక పరీక్ష జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. మిర్యాలగూడ పట్టణ పరిధి, మండలంలోని 12 పరీక్ష కేంద్రాల్లో 2,662 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10 మంది గైర్హాజరయ్యారు. ఆయా పరీక్షా కేంద్రాలను ఎంఈఓ బాలాజీనాయక్ తనిఖీ చేశారు.
నకిరేకల్ మండల కేంద్రంలో 4 సెంటర్లలో 790 విద్యార్థులకు 788 హాజరైనట్లు అధికారులు తెలిపారు. కేతేపల్లి మండలంలో వందశాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. తిప్పర్తి మండల కేంద్రంలో రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 321 మందికి అందరూ హాజరై పరీక్షలు రాశారు. పెద్దవూర మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో 240 మందికి 238 మంది, న్యూకిడ్స్లో 169 మందికి 169 మంది హాజరయ్యారు. అలాగే నార్కట్పల్లి మండలంలో 5 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
జడ్పీహెచ్ఎస్ నార్కట్పల్లిలో 179, అమ్మనబోలు-78, బి.వెల్లెంల-80, ఎస్పీఆర్-220, శ్రీ చేతన-139 మొత్తం 696 మంది విద్యార్థులు హాజరయ్యారు. శాలిగౌరారం మండలంలో మొత్తం 337 మందికి అందరూ హాజరైనట్లు ఎంఈఓ నాగయ్య తెలిపారు. నందికొండ మున్సిపాలిటీలోని హిల్కాలనీలో గల సెయింట్ జోసెఫ్ పాఠశాలలో 170 మందికి 170, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 139 మందికి 139 మంది పరీక్షకు హాజరైనట్లు పరీక్ష కేంద్రం అధికారులు చెప్పారు. కట్టంగూర్ మండలంలో మూడు కేంద్రాల్లో 425 మందికి 424మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
త్రిపురారం మండలంలో 395 మందికి అందరూ పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. హాలియా మండలంలో మొత్తం 725 మంది విద్యార్థులకు గానూ ఇద్దరు విద్యార్థులు గైర్హాజర్ కాగా 723 మంది పరీక్షలు రాసినట్లు ఎంఈఓ లావూరి బాలూనాయక్ తెలిపారు. దామరచర్ల మండలంలోని మూడు కేంద్రాల్లో 538 మంది పరీక్షలు రాస్తున్నారు. తొలిరోజు ఒక్కరు మాత్రమే గైర్హాజరైనట్లు అధికారులు చెప్పారు. అలాగే అడవిదేవులపల్లి మండలంలో వంద శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ బాలు తెలిపారు. చందంపేట మండలంలో 1,295 మందికి ఐదుగురు గైర్హాజరైనట్లు ఎంఈఓ మాతృనాయక్ తెలిపారు. నేరేడుగొమ్ము మండలంలో 160 మందికి అందరూ హాజరైనట్లు ఎంఈఓ సామ్యనాయక్ చెప్పారు. మునుగుడో మండలంలో 446 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను స్టేట్ పరిశీలకుడు రమణకుమార్ పరిశీలించారు.