రామగిరి, ఏప్రిల్ 11 : పదో తరగతి పరీక్షలు మంగళవారం సజావుగా ముగిశాయి. ఈ నెల 3న ప్రారంభమైన పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పరీక్షలు ముగిసిన తర్వాత ఆయా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు సందడి చేశారు. తమ మిత్రులను వీడిపోతున్నామంటూ ఒకరికొకరు బై..బై చెప్పుకుంటూ సెల్ఫీలు దిగారు. మరో వైపు ఇన్ని రోజులు హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు తమ సామగ్రిని తీసుకొని తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఇంటి బాట పట్టారు.