రామగిరి/సూర్యాపేట అర్బన్, మార్చి 18 : పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలు జరిగాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 19,326 మంది విద్యార్థులకు 19,19175 మంది హాజరయ్యారు. 151మంది విద్యార్థులు గైర్హాజయ్యారు.
ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా సమయం సమీపిస్తుండటంతో విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు పరుగులు తీశారు. ఎక్కడా విద్యార్థులు ఆలస్యంగా రాలేదు. నల్లగొండలోని రెండు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ప్రత్యే క పరిశీలకులు సీహెచ్.రమణ కుమార్, డీఈఓ భిక్షపతి పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 11,946 మంది విద్యార్థులకు 11,904 మంది పరీక్షలకు హాజరయ్యారు. 39 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 5 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, డీఈఓ అశోక్ తనిఖీ చేశారు.