కట్టంగూర్, నవంబర్ 30 : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం వారి సమక్షంలో మండలంలోని పరడ గ్రామానికి చెందిన దూదిమెట్ల నరేశ్, బొబ్బలి నవీన్, బుర్రి రాకేశ్, మాండ్ర సత్యనారాయణ, బెల్లి వెంకన్న, సాగర్ల ఉపేందర్తో పాటు 100మంది కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీఎం కేసీఆర్కు అండగా ఉంటూ మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా శ్రమించాలన్నారు. ఈడీ, ఐటీ దాడుల పేరుతో భయపెట్టేందుకు చూస్తున్న దుర్మార్గమైన బీజేపీ నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. అనంతరం విద్యుదాఘాతంతో మృతిచెందిన కట్టంగూర్ మండలంలోని గాంధీనగర్కు చెందిన కడమంచి శ్రీలతకు విద్యుత్శాఖ నుంచి మంజూరైన రూ.5లక్షల చెక్కును కుటుంబసభ్యులకు అందించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, స్థానిక సర్పంచ్ పుట్ట సుజనావెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, ఎంపీటీసీ ఎడ్ల పురుషోత్తంరెడ్డి, కట్టంగూర్ ఉప సర్పంచ్ అంతటి శ్రీను, మాజీ ఎంపీటీసీ మంగదుడ్ల వెంకన్న, నాయకులు జీడిపల్లి ఉపేందర్రెడ్డి, చౌగోని జనార్దన్, రెడ్డిపల్లి మనోహర్, బుడిగ సత్తయ్య, హుస్సేన్ పాల్గొన్నారు.