మర్రిగూడ,సెప్టెంబర్ 15 : రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని దామెరభీమనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు 100 మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో జరుగబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అందుకే ఆ పార్టీ అభ్యర్థిని గ్రామాల్లోకి వస్తే తరిమి కొడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, టీఆర్ఎస్ మండలాధ్య్యక్షుడు శంకర్, ఎంపీటీసీ శిలువేరు విష్ణు, మాజీ సర్పంచ్ అంతిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నడిమింటి శ్రీను, నాయకులు పాల్గొన్నారు.