ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి
హాలియా, పిబ్రవరి 24 : హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా పని చేద్దామని నల్లగొండ ఎంపీ నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి, ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం జరిగిన హాలియా మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రెండేండ్ల కాలంలో మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పారదర్శకంగా వ్యవహరించి మున్సిపాలిటీ గౌరవాన్ని కాపాడాలన్నారు. మున్సిపల్ సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మకు సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డిని మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కమిషనర్ వేమనరెడ్డి, వర్రా వెంకట్రెడ్డి, చింతల చంద్రారెడ్డి, ప్రసాద్నాయక్, అన్నెపాక శ్రీను, నల్లబోతు సుధాకర్, గౌని సుధారాణి, చింతల దీప్తి, మున్సిపల్ కోప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.