ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
దేవరకొండ రూరల్, ఫిబ్రవరి 23 : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండల పరిధిలోని వైదోని వంపు గ్రామపంచాయతీలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు, తండాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకందేలా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లగాజు నానీయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, కృష్ణయ్య, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, ఎంపీటీసీ ఉత్తరమ్మ, సర్పంచులు నల్లగాసు పాపమ్మ, అంజియాదవ్, మల్లేశ్, శ్రీను పాలొన్నారు.
హనుమంతరావు మృతి బాధాకరం
డిండి : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హన్మంతరావు మృతి బాధాకరమని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని రుద్రాయగూడెం గ్రామంలో బుధవారం నిర్వహించిన హన్మంతరావు దశదిన కర్మలో ఎమ్మెల్యే పాల్గొని మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హనుమంతరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాసరావు, విష్ణువర్ధన్రెడ్డి, గోపాల్రావు, భగవంతరావు, రాఘవేందర్రావు, సురేశ్గౌడ్, సుభాశ్గౌడ్, ముత్యపురావు, కృష్ణయ్య, కృష్ణ పాల్గొన్నారు.