స్వామి వారి ఖజానాకు రూ.10,16,826
యాదాద్రి, ఫిబ్రవరి 23 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలలో అభిషేకించి, తులసీ అర్చనలు చేశారు. లక్ష్మీ నరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన హోమం, లక్ష్మీ నరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. అన్ని విభాగాల నుంచి రూ.10,16,826 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.