మునుగోడు రూరల్, ఫిబ్రవరి 5 : రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు రూ. 20 లక్షలు, ఉపాధి హామీ నిధులు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అంతకు ముందు ఆయుష్మాన్ భారత్ పేర్ల నమోదును ప్రారంభించారు. ఆయనకు ఆ గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గ అభివృద్ది కొరకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, దానిలో భాగంగానే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, సర్పంచ్ వల్లూరి పద్మాలింగయ్య, ఎంపీటీసీ మిర్యాల లక్ష్మమ్మాబీరప్ప, ఈద నిర్మలాశరత్ బాబు, బొడ్డు శ్రావణీనాగరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి, ఏఈ రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు ఐతగోని లాల్ బహుదూర్, మామిల్ల వెంకట్ రెడ్డి, దండు యాదయ్య, ఎల్లంకి యాదగిరి, ఐతగోని శేఖర్, శిర్గమళ్ల కిశోర్, నాగరాజు, ప్రణయ్, వెంకన్న, మల్లేశ్, సీఎస్సీ ఆపరేటర్ రామలింగయ్య పాల్గొన్నారు.
మర్రిగూడలో..
మర్రిగూడ : మండలంలోని సరంపేటలో రూ. 1.10 కోట్లు,లెంకలపల్లిలో రూ. 70లక్షల ఎన్ఆర్ఈజీఎస్,ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే కూసుకుంట్ల మాట్లాడుతూ గ్రామాలను అన్నీ రంగాల్లో అభివృద్ధ్ది చేసేందుకు నిరంతరం పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ
తిరుగండ్లపల్లిలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పంగడాల ముత్తు ముందుకొచ్చారు.ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గుడి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ ముత్తును ఎమ్మెల్యే అభినందించారు. ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి,సర్పంచులు ఐతపాక జంగయ్య,వెనమల్ల వెంకటమ్మ,పాక నగేశ్,ఎంపీటీసీలు గండికోట రాజమణీహరికృష్ణ,ఊరిపక్క సరితానగేశ్, శిలువేరు విష్ణు, మార్కెట్ కమిటీ, రైతుబంధు సమితి చైర్మన్లు దంటు జగదీశ్, బచ్చు రామకృష్ణ, మాజీ ఎంపీపీ అనంత రాజుగౌడ్, దళితబంధు డైరెక్టర్ లపంగి నర్సింహ, సీనియర్ నాయకులు మునగాల వెంకటేశ్వర్రావు, రామిడి వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్, ప్రధానకార్యదర్శి ఐతగోని వెంకటయ్యగౌడ్, ఉపాధ్యక్షులు పందుల పాండుగౌడ్, గంట కృష్ణసాగర్, మారగోని వెంకటయ్య, నాయకులు కాట్రోత్ రాజునాయక్, అయి లి లక్ష్మీనర్సింహ, ఎండీ.రజాక్, వర్కాల వెంకటేశ్, గిరినేత, గిరిగౌడ్, మహేందర్, మల్లయ్య, సైదులు యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.