రామగిరి, జనవరి 7: పేదరికంతో విద్యార్థులు విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత సన్న బి య్యంతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నా వంట ఏజెన్సీల వారు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతుండేవారు. గతంలో ఒక్కొ గుడ్డుకు రూ.4.05 చెల్లించగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో జూన్ నుంచి రూ.5 పెంచుతున్నట్లు జీ ఓ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా ఒక్కో గుడ్డుకు రూ.5 చొప్పున ఉమ్మడి నల్లగొండ జి ల్లాకు రూ.3,84,68,000 కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. దాంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మధ్యాహ్న భోజనానికి ధరల పెంపు ఇలా..
2020-21 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజ నం ధరలను పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. గతేడాది ప్రాథమిక పాఠశాలల విద్యార్థికి రూ.0.49 పైసలు మొత్తం రూ.4.97, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థికి రూ.0.74 పైసలు ఒక్కొ విద్యార్థికి రూ.7.45కు పెంచారు. గతంలో గుడ్డుకు రూ.4.05 అందిస్తుండగా ప్రస్తు త ధరలకు అనుగుణంగా జూన్, 2022 నుంచి రూ. 5 అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,1 08 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2,08, 131 విద్యార్థులకు మేలు జరుగనున్నది. అంతేగాకుండా మెనూలో చూపిన విధంగా వారంలో 3 రోజులు గుడ్లు ఇవ్వనున్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
ప్రభుత్వం, విద్యాశాఖ సూచించిన మెనూ ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలి. పాఠశాలల్లో భోజనం ఇన్చార్జి రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు వడ్డించాలి. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. ఏమైనా సమస్యలు వస్తే కచ్చితంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెనూ పాటించడం లేదని తెలిస్తే ఆ పాఠశాల నిర్వాహకులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆకస్మికంగా పాఠశాలలను తనిఖీ చేయడం జరుగుతుంది.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ.