సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నగరంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో బెట్టింగ్ పాల్పడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్న ముగ్గురు నిందితులను రాచకొండ పరిధి..ఎల్బీనగర్ జోన్ ఎస్ పోలీసులు రెడ్ పట్టుకున్నారు. వారి నుంచి రూ.20లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 1.42 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. ఈ మేరకు నేరేడ్మెట్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్.చౌహాన్ కేసు వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎడుకుల జగదీశ్ నాగోల్ బండ్లగూడలో ఉంటూ సబ్ బుకీగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. వనస్థలిపురానికి చెందిన జక్కిరెడ్డి అశోక్ వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. క్రికెట్ బెట్టింగ్ అలవాటుపడిన అతడు గడిచిన 10-12 సంవత్సరాల్లో దాదాపు రూ.100కోట్లు పోగొట్టుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడించాడు.
కేపీహెచ్ కాలనీ, వసంతనగర్ చెందిన చరణ్ వృత్తిరీత్యా సాఫ్ట్ ఉద్యోగి. బెట్టింగ్ మోజులో పడి ఉద్యోగం మానేసి క్రికెట్ బుకీ సురేశ్ అలియాస్ శివకు కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. కాగా అశోక్ ఇతర సబ్ బుకీలైన శివ, ఏపీకి చెందిన పలాస శ్రీనివాస్రావును మరో సబ్ బుకీ జగదీశ్కు పరిచయం చేశాడు. జగదీశ్ మాత్రం హర్యానాకు చెందిన ప్రధాన బుకీ విపుల్ మోంగాతో నేరుగా సంబంధాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జగదీశ్, అశోక్ చరణ్ కలిసి నేషనల్ ఎక్స్ ద్వారా ఈ బెట్టింగ్ రాకెట్ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో 2023 సీజన్ ఐపీఎల్ మ్యాచ్ ఇప్పటి వరకు నిందితులు సుమారు 3కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాలతో పాటు నేరుగా మార్పిడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ నెల 14న సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చైతన్యపురి ఠాణా పరిధిలో ఫోన్ ద్వారా బెట్టింగ్ పాల్పడుతున్నట్లు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు స్థానిక పోలీసులతో కలిసి జగదీశ్, జక్కిరెడ్డి, చరణ్ను అరెస్టు చేశారు. ప్రధాన బుకీతో పాటు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. రాచకొండ సీపీ ఆదేశాల మేరకు ఎల్బీనగర్-మహేశ్వరం జోన్ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సుధాకర్ దర్యాప్తు చేస్తున్నారు.