గరిడేపల్లి, డిసెంబర్ 21: పేదరికం.. తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్న ఆ యువకుడు ఓ వైపు చదువుకుంటూనే పనులకు వెళ్తూ సాయం అందించేవాడు. ఆ క్రమంలోనే ఓ రైతు పొలంలో పనిచేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అప్పటికే ఖరీదైన వైద్యంతో ప్రాణాలు నిలిచాయి కానీ, రెండు కాళ్లు, కుడి చెయ్యిని కోల్పోయాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు చేసి ఆరోగ్యం కాపాడుకున్నాడు. కానీ, రెండు కాళ్లూ కోల్పోయి నరక యాతన పడుతున్నాడు. ఇంటికే పరిమితమైన కుమారుడికి తల్లే అన్నీ తానై ఏడేండ్లుగా సేవలు చేస్తున్నది. జైపూర్ ఫూట్ అమర్చిన చోట రక్తం వస్తుడడంతో ఇబ్బంది పడుతున్నాడు. అత్యాధునిక ఆర్టిఫీషియల్ లెగ్స్ అమర్చితే ఇబ్బంది ఉండదని వైద్యులు చెప్పడంతో వాటికి అవసరమైన రూ.4లక్షల కోసం దాతలను కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన పెద్దోజు సైదయ్య చారి, వీరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పదో తరగతి వరకు చదివిన చిన్న కుమారుడు నవీన్ 2014లో స్నేహితుడితో కలిసి ఓ రైతు పొలంలో విద్యుత్ లైన్ను ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైయ్యాడు. సుమారు నాలుగు నెలల పాటు చికిత్స చేసిన వైద్యులు రెండు కాళ్లను, కుడి చేయిని తొలగించారు. అప్పటికే రూ.14లక్షలు ఖర్చు కాగా వ్యవసాయ భూమిని అమ్ముకొని ఆస్పత్రి ఫీజులు చెల్లించారు.
దాతలు సాయం అందించాలంటే..
అకౌంట్ నంబర్ : 73133894947
బ్యాంక్ : ఏపీజీవీబీ, వెలిదండ బ్రాంచ్
ఐఎఫ్ఎస్సీ : ఏపీజీవీ0006322
ఫోన్ నంబర్ : 9912289677ను సంప్రదించాలి