హాజరైన మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సినీనటి సమంత
రామగిరి, ఫిబ్రవరి 23 : ప్రముఖ హీరోయిన్ సమంత బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. హైదరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత వస్తున్నదని నిర్వాహకులు ప్రచారం చేయడంతో జనం పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాంతో ఎన్టీఆర్ విగ్రహం కూడలి మొత్తం జన సంద్రమైంది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. సన్రూఫ్ కారులో హాయ్ చెప్తూ అభిమానులను పలుకరించిన సమంతా.. షాపింగ్ మాల్ లోపలికి వెళ్లి వస్ర్తాలను పరిశీలించి చీరలను కొనుగోలు చేశారు. అనంతరం షాపింగ్ మాల్ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపైకి వచ్చి మాట్లాడుతూ.. ‘ఊ అంటావా నల్లగొండ.. ఊఊ అంటావా’ అనడంతో జనం ఈలలతో హోరెత్తించారు. అంతకు ముందు మంత్రి జగదీశ్రెడ్డి షాపింగ్ మాల్ రిబ్బన్ కట్ చేయడంతో పాటు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మాంగళ్య షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకులు పీఎన్ మూర్తి, చైర్మన్ కాసం నమఃశివాయ, డైరెక్టర్లు శివప్రసాద్, అరుణ్ పాల్గొన్నారు.