ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
పలు గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 24 : గ్రామాల సమగ్రాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డికాలనీ, దండంపల్లి, పెద్దసూరారం, చిన్నసూరారం, జీకే అన్నారం, అన్నారెడ్డిగూడెం, వెలుగుపల్లి, ముషంపల్లి, తొరగల్లు, మేళ్లదుప్పలపల్లి, కొత్తపల్లి, అనంతారం గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. మండలంలో రూ. 2.30 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారన్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి,మున్సిల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, వైస్ చైర్మన్ తవిట కృష్ణ, సర్పంచులు ఎలుక శ్రీనివాస్రెడ్డి, చింత పుష్పా సైదులు, కోట్ల రమాదేవి, నారగోని నరసింహ, బోధనం సరస్వతి, ఎండ్ల ఆండాలు, బైరెడ్డి వెంకట్రెడ్డి, రొమ్ముల నాగ య్య, వీరమణి, మనిమద్దె పద్మావతీసైదులు, నాయకులు గాదె రాజశేఖర్రెడ్డి , సంకు ధనలక్ష్మి, బీరం గోపాల్రెడ్డి, బడుపుల శంకర్, కోట్ల జలంధర్రెడ్డి, జయపాల్రెడ్డి, సహాదేవులు, పెండెం అరుణ, పొగాకు ఘట్టయ్య, పీఆర్డీఈ నాగయ్య, ఏఈరాములు పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
నీలగిరి : మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్-1) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను గురువారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నివాసంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి మత్స్యగిరి, నాయకులు వంటల సోమయ్య, శ్రీకాంత్, శుభ కరణ్సింగ్, చెరుకు శంకర్, లూర్దుమేరి, సుజాత, కొప్పు శంతన్, మహ్మద్ కరీముల్లా, సీతారాములమ్మ, అద్దంకి జ్యోతి, పురుషోత్తంరాజు, బైరగోని యాదయ్య, కోటప్ప, సురేశ్కుమార్, సత్తిరెడ్డి పాల్గొన్నారు.
ఆర్థిక సాయం
కనగల్ : మండలంలోని దోరెపల్లి గ్రామపంచాయతీ కార్మికుడు దాసరి అంజయ్య కుమార్తె విజిత వివాహానికి గురువారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి రూ.10 వేలు, టీఆర్ఎస్ కనగల్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్ రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. 30 ఏండ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న అంజయ్య సేవలను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం తన కూతురు వివాహానికి రావాలని ఎమ్మెల్యే కంచర్లకు అంజయ్య ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో దర్వేశిపురం ఆలయ కమిటీ చైర్మన్ నల్లబోతు యాదగిరి, ఉపసర్పంచ్ దాసరి వెంకన్న పాల్గొన్నారు.