రూ.5 లక్షల విలువైన సరుకు స్వాధీనం
భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 23 : గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 5,12,000 విలువైన సరుకు, రెండు సెల్ఫోన్లు, స్కూటర్ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ సాయిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం ఏసీపీ కార్యాలయంలో పట్టణ సీఐ సత్యనారాయణతో కలిసి విలేకరులకు ఆయన నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నల్లగొండ ఫ్లైఓవర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బేగంబజార్కు చెందిన ఆకాశ్ కశ్యప్ స్కూటర్పై గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. రెండు సంచుల్లోని గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని విచారించారు. శేరిలింగంపల్లికి చెందిన వ్యాపారి కమల్కిశోర్ బజాజ్ నుంచి సరుకు కొనుగోలు చేసినట్లు ఆకాశ్ కశ్యప్ తెలిపాడు. దాంతో పోలీసులు శేరిలింగంపల్లిలోని వ్యాపారి కమల్కిశోర్బజాజ్కు చెందిన గోడౌన్ తనిఖీ చేసి 38 బ్యాగుల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీసీ వెంకట్రెడ్డి తెలిపారు.