తిప్పర్తి, జనవరి 18 : నేటి నుంచి ప్రారంభం కానున్న కంటివెలుగులో బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నల్లగొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. వసతులు, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు, వృద్ధ్దులు అధికంగా వస్తారని వారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ కృష్ణ య్య, ఎంపీడీఓ మహేందర్రెడ్డి, ఎంపీఓ నర్సింహాస్వామి, డాక్టర్ ప్రదీప్ బాబు, ఏఓ సన్నిరాజు పాల్గొన్నారు.
కంటి వెలుగును పకడ్బందీగా చేపట్టాలి
నల్లగొండ : నల్లగొండ మున్సిపాలిటీలో నిర్వహించే కంటి వెలుగును పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణా చారి అన్నారు. పట్టణంలోని వార్డుల్లో ఏర్పాటు చేసినకంటి వెలుగు కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించి అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం జరగవద్దని అన్నారు. పరీక్షలు చేసి ప్రభుత్వ ఆదేశానుసారం మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ ఈఈ రాములు, డీఈ అశోక్ కుమార్, నర్సింహారెడ్డి, మహ్మద్ ఖాజా ఆరీపోద్దిన్, పవన్ కుమార్, వెంకన్న, నాగిరెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.
ఇంటింటికీ ఆహ్వాన పత్రికలు
మునుగోడు : రెండో విడుత కంటి వెలుగు శిబిరాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా వైద్య సిబ్బంది బుధవారం ఇంటింటికీ వెళ్లి మండల వ్యాప్తంగా ఆహ్వానాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారి జమీరు మాట్లాడుతూ కంటి వెలుగు ద్వారా మండల వ్యా ప్తంగా 50 వేల మంది ప్రజలకు కంటి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ
మర్రిగూడ : మండలకేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం కంటివెలుగు ఆహ్వాన పత్రికను తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి,ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు ఆవిష్కరించారు. వైద్యాధికారి దీపక్, ఎంపీఓ ఝాన్సీ, ఐకేపీ,ఈజీఎస్, పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
నార్కట్పల్లి : కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ యాదగిరి ఒక ప్రకటన లో కోరారు. మండలంలోని అక్కెనపల్లి, ఎల్లారెడ్డి గూడెం, కొండపాకగూడెం గ్రామాల్లో కంటి వెలుగును జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ప్రారంభించనున్నట్లు పేరొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
కంటి వెలుగు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
మిర్యాలగూడ రూరల్ : మం డలంలోకంటివెలుగుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి తెలిపారు. కొత్తగూడెం, వెంకటాద్రిపాలెం, యాద్గార్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను బుధవారం ఆమె పరిశీలించారు. వైద్యాధికారి షేక్ మొహీద్, ఎంపీఓ టి. వీరారెడ్డి, సర్పంచులు బారెడ్డి అశోక్రెడ్డి, దుండిగాల యాదమ్మాశ్రీనివాస్, మద్దెల శ్రీలత, ఉన్నారు.
త్రిపురారం : మండలకేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు శిబిరంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈఓపీఆర్డీ భిక్షంరాజు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే రాగడపలో అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని డాక్టర్ రమావత్ శంకర్ పరిశీలించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు లక్ష్మీనారాయణ, గోపాల్రెడ్డి, సీహెచ్ఓ తావునాయక్, ఏఎన్ఎంలు, పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి : కంటివెలుగును విజయవంతం చేయాలని ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. కార్యక్రమంలో తాసీల్దార్ రఘు, ఎంపీడీఓ ఎండీ మసూద్ షరీఫ్, ఎంపీఓ లలిత పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలంలోని చెర్వుఅన్నారం, కట్టంగూర్ గ్రామాల్లో ప్రారంభం కానున్న కంటి వెలుగు ఏర్పాట్లను ఎంపీడీఓ పోరెళ్ల సునీత తాసీల్దార్ దేశ్యానాయక్, వైద్యాధికారి శ్వేతతో కలిసి బుధవారం పరిశీలిం చారు. ఎంపీఓ మహ్మద్ అథర్ పర్వేజ్ పాల్గొన్నారు.
చిట్యాల : కంటి వెలుగు కార్యక్ర మాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి కిరణ్కుమార్, మున్సిపల్ మేనేజర్ సూర్జత్ బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కంటి వెలుగు కార్య క్రమాన్ని ప్రారంభింస్తారని పేర్కొన్నారు.