వెల్దండ: విద్యాభివృద్ధి కోసం నిరంతరం తోడ్పాటునందిస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తన సొంత డబ్బులతో సమకూర్చిన 1600 డిక్షనరీలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్య కోసం అన్ని వేళలా తోడ్పాటు అందిస్తానన్నారు. గతంలో కల్వకుర్తి, ఆమనగల్లు పట్టణాల్లో యువతకు పలు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ విజయ, మండల రైతుబంధు అధ్యక్షుడు భాస్కర్రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ సంజీవ్ కుమార్, మాజీ ఎంపీపీ ప్రకాశ్, సర్పంచ్లు భూపతిరెడ్డి, అంజినాయక్ వెంకటేశ్వరరావు, మైసయ్య, ఎంపీటీసీ గుత్తి వెంకటయ్య, నాయకులు జైపాల్ నాయక్, నారాయణ, మండల యూత్ అధ్యక్షుడు రవిగౌడ్, హెచ్ఎంలు అంజయ్య, పుష్పలత అధ్యాపకులు చంద్రశేఖర్, అమర్ సింగ్ పాల్గొన్నారు.