ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఫైసల్ సుల్తాన్ శనివారం తెలిపారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన నివాసంలో స్వీయ ఐసొలేషన్లో ఉన్నట్లు చెప్పారు. పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. కాగా ఇమ్రాన్ ఖాన్ రెండు రోజుల కిందట చైనా అభివృద్ధి చేసిన కరోనా టీకా వేయించుకున్నారు. అనంతరం ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.