కాటారం, మార్చి 16: ‘ఒక్కోసారి విధి రాత ఎంత భయంకరంగా ఉంటుందో.. కాటారం మండలం గారెపల్లికి చెందిన పస్తం రాజేశ్వరి కుటుంబం దీనగాథ చూస్తే అర్థమ వుతుంది. దాదాపు 20 ఏళ్ల క్రితమే ఆమె భర్త రాజేశ్ పక్షవాతంతో మంచం పట్టాడు. కుటుంబాన్ని పోషించుకునేం దుకు భర్త నిర్వహించే ఫొటో స్టూడియో నడుపు తూ.. చెప్పు లు అమ్ముకుంటూ కొడుకు రామకృష్ణ ను బీఈడీ వరకు చది వించింది. ఇక కుటుంబానికి కొడుకు అండగా ఉంటున్న క్ర మంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. ఏమైందో ఏమో గాని ఈ నెల 14న రాత్రి నిద్రపోయిన కొడుకు ఎంతకూ లేవకపో వడంతో ఆ తల్లి గుండె రాయి చేసు కొని ఇరుగుపొరుగు వారి సాయంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకు వెళ్లింది. విధి వెక్కిరించిన ఆ కుటుంబానికి మరో పెద్ద కష్ట మే ఎదురైంది. రామకృష్ణ మెదడులో రక్తం గడ్డ కట్టి శరీరం మొ త్తం చచ్చుబడిపోయిందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ చేస్తే బతుకు తాడ ని, అందుకు రూ. 7లక్షల దాకా ఖర్చ వుతుందన్నారు. అనంతరం హైదరా బాద్లోని నిమ్స్ దవాఖానకు తీసుకెళ్ల గా, అక్కడి వైద్యులు రెండు మూడు రోజులైతే గానీ ఏం చెప్పలేమని తెలి పారు. అసలే నిరుపేద కుటుంబం.. చేతి లో చిల్లి గవ్వ లేని ఈ పరిస్థితిలో ఇటు భర్తను సాకలేక.. అటు కుమా రుడిని బతికించుకునే మార్గం తెలియ క దిక్కుతోచని స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ఎవరైనా దాతలు దయతలచి ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నంబర్ 285810100015805 (ఐఎఫ్ఎస్సీ నం. ANDB0002858) ద్వారా కానీ, 994 9341818 ఫోన్ నంబర్తో గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కానీ సాయమందించాలని కోరుతున్నారు. రామకృష్ణ స్నేహితులు కూడా సంజీవని సేవా సమితి ఆధ్వ ర్యంలో సామాజిక మాధ్యమం ద్వారా మానవతావాదులను సాయం కోసం అర్థిస్తూ విరాళాలు సేకరిస్తున్నారు.
రామకృష్ణ కోలుకునే వరకు ఆ కుటుంబానికి అండగా ఉంటా నని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు హామీ ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో రామకృష్ణ ఆరోగ్య పరిస్థితిని మంగళవారం పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.