వినాయక్నగర్, జూలై 23: అక్రమ నిర్మాణాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ మమత అన్నారు. శుక్రవారం అల్వాల్ సర్కిల్లోని శివానగర్లో జోనల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడి భూమికి సంబంధించిన వివరాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అల్వాల్ డీసీ నాగమణి తదితరులు పాల్గొన్నారు.