మల్కాజిగిరి జోన్బృందం, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా పార్టీ శ్రేణులు నిర్వహించుకున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి, గౌతంనగర్, వినాయక్నగర్, నేరేడ్మెట్, మౌలాలి, ఈస్ట్ ఆనంద్బాగ్, అల్వాల్, మచ్చబొల్లారం, వెంకటాపురం డివిజన్లలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతికదూరం పాటిస్తూ నేతలు ఆయా ప్రాంతాల్లో పార్టీ పతాకాలను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. తెలంగాణ సాధకునిగా కేసీఆర్ పట్టుదల, పలువురు కొనియాడారు. నీళ్లు నిధులు, నియామకాల నేపథ్యంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పూర్తి చేసుకున్నాయన్నారు. మల్కాజిగిరి చౌరస్తాలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు కార్యకర్తలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిఠాయిలు తినిపించుకున్నారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు ప్రేంకుమార్, మీనా ఉపేందర్రెడ్డి, మేకల సునీతా రాముయాదవ్, రాజ్ జిత్రేందనాథ్, సబితా అనిల్కిశోర్తో పాటు రాష్ట్ర నాయకులు వీకే మహేశ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, పిట్టల శ్రీనివాస్, జీఎన్వీ సతీశ్కుమార్, గుండానిరంజన్, ఉపేందర్రెడ్డి, రాముయాదవ్, సత్యనారాయణ, మోహన్రెడ్డి, సంతోష్, ఎస్ఆర్ ప్రసాద్, కరంచంద్, గోకుల్ శ్రీనివాస్, చిందం శ్రీనివాస్, చెన్నారెడ్డి, కొండల్రెడ్డి, అల్వాల్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, శ్రీ శైలం యాదవ్, సూర్యకిరణ్, శ్రావణ్, దేవేందర్, వెంకటేశ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.