కీసర, జూలై 17: గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదానికి చిరునామాగా నిలుస్తున్నాయని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. మండల పరిధిలోని భోగారంలో పల్లె ప్రకృతివనాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రకృతి వనం, డంపింగ్యార్డు, హరితహారం, నర్సరీ, వైకుంఠధామాలను ఏర్పాటు చేశారని తెలిపారు. స్థానికంగా ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు సమకూరుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో చేపట్టే ప్రతి పనిని స్థానిక నేతలు చాలెంజ్గా తీసుకోవాలని సూచించారు.పదిరోజుల పాటు చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో చాలా వరకు పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పై ఉందన్నారు. గ్రామాల్లో చేపట్టే ప్రతి పనికి రికార్డులను తయారు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత జైహింద్రెడ్డి, ఎంపీటీసీ వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ జానకీరాం, పంచాయతీ కార్యదర్శి గౌతమి, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.