వినాయక్నగర్, సెప్టెంబర్ 15 : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం అల్వాల్ సర్కిల్ హెచ్ఎంటీ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో బీటీ రోడ్డు, యూజీడీ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా అవసరమైన చోట నూతనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీల అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు అధికారులతో సహకరించాలని సూచించారు. హరితహారంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రేంసాగర్రావు, కార్యదర్శి రాజరెడ్డి ఉన్నారు.
మల్కాజిగిరి, సెప్టెంబర్ 15 : మల్కాజిగిరి నియోజక వర్గంలోని 9 డివిజన్లకు త్వరలోనే టీఆర్ఎస్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడతూ పార్టీ అభివృద్ధియే ధ్యేయంగా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీ అభివృద్ధియే లక్ష్యమన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్రెడ్డి, సబితా అనిల్కిశోర్, రాజ్ జితేంద్రనాథ్, మీనా ఉపేందర్రెడ్డి, ప్రేంకుమార్, సునీతారాముయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, నాయకులు పరశురాంరెడ్డి, జీఎన్వీ సతీశ్కుమార్, శ్రీనివాస్, గుండా నిరంజన్ పాల్గొన్నారు.