మల్కాజిగిరి, అక్టోబర్ 17: అల్వాల్ సర్కిల్లో రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ రోడ్ల కోసం రూ.1.50 కోట్లు కేటాయించి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. అల్వాల్ సర్కిల్లో కానాజీగూడ నుంచి భూదేవీనగర్, వెంకటాపురం చౌరస్తా వరకు వరకు వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణ పనులు జరిగాయి. గతంలో గుంతలు పడిన రోడ్డుతో వాహనదారులు, ఆర్టీసీ బస్ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. కాగా, అల్వాల్ సర్కిల్ పరిధిలో రూ.190 కోట్లతో మంచి నీటి పైపులైన్ పనులు చేపట్టారు.
పైపులైన్ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత రూ. 80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆ ప్రతిపాదనలు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. దీంతో నిధులు మంజూరయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలో మొదటిసారిగా రూ.92లక్షలతో వెస్ట్ వెంకటాపురం మెయిన్ రోడ్డులో వైట్ టాపింగ్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి పూర్తిచేశారు. ఈ రోడ్ల నాణ్యత దాదాపు 20 ఏండ్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం లోతుకుంట నుంచి వెంకటాపురం చౌరస్తా వరకు రూ.1.30 కోట్లతో వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో మొదటి వైట్ టాపింగ్ రోడ్డు వేశాం. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. ఉమ్మడి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే అల్కాల్ సర్కిల్ పరిధిలో సమస్యలు ఉన్నాయి. మెయిన్ రోడ్డులో రూ.1.50 కోట్లుతో వైట్ టాపింగ్ రోడ్డు పనులు పూర్తి చేశాం. లోతుకుంట నుంచి వెంకటాపురం వరకు రూ.1.30కోట్లతో వైట్ టాపింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ పనులను యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.