కుత్బుల్లాపూర్,జూలై18: ప్రజలకు చేరువలో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పని చేసేందుకు తాను నిరంతరం సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం పేట్ బషీరాబాద్లోని క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన ప్రజలు తమ సమస్యలను తెలుపుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్న సమయంలోనే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేలా కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, ఎవరు అధైర్యపడరాదని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను అందించి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.