జీడిమెట్ల, జూలై 14 : చింతల్ డివిజన్ పరిధి పద్మశాలి బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడుతానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. బుధవారం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహమ్మద్ఫ్రీతో కలిసి పద్మశాలి బస్తీలో స్థానికులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, బోర్వెల్స్ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, స్థానిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాయికుమార్, స్థానిక నాయకులు బస్వరాజ్, జెమ్స్, శేఖర్రావు, వహీద్, జ్యోతి, ప్రభ, కవిత, శాంతి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
చింతల్ డివిజన్ పరిధిలోని పద్మశాలి బస్తీలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయం, దుర్గామాత దేవాలయాల అభివృద్ధికి ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ రూ.2 లక్షల నగదును విరాళంగా అందజేశారు. అలాగే న్యూ లాల్ బహదూర్నగర్లో నూతనంగా నిర్మిస్తున్న అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, కార్పొరేటర్ రావుల శేషగిరిరావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్,జూలై14: ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం పేట్బషీరాబాద్ క్యాంపు కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు సంక్షేమ కాలనీల వాసులు, ఆయా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను కలిసి తమ సమస్యలను వినతిపత్రాల ద్వారా తెలుపుకున్నారు. సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీలవాసులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.