దుండిగల్, జూన్ 24 : కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజుల రామారం సర్కిల్, సూరారం డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం అదనపు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేశ్రెడ్డి, నేతలు సిద్దిఖీ, ఫిరోజ్, కేంద్రం వైద్యాధికారి షెహనాజ్ పాల్గొన్నారు.