ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 28 : నూతనంగా ఎన్నికైన నాయకులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు సంతోష్కుమార్ గౌడ్, చింతకింది వేణు గోపాల్, కొర్రెముల గ్రామశాఖ ఉపాధ్యక్షుడు నర్సింగ్రావు మంత్రిని మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, ఉప సర్పంచ్ రాజు, నాయకులు నాగార్జున, దుర్గరాజు గౌడ్, సత్యనారాయణ, రవికుమార్, బాలరాజు, నరసింహ పాల్గొన్నారు.
ఘట్కేసర్ మండలం టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా బస్వరాజుగౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బస్వరాజ్గౌడ్ను మంత్రి మల్లారెడ్డి తన నివాసంలో సన్మానించారు. అనంతరం బస్వరాజ్గౌడ్ మంత్రి , రాజశేఖర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాచవానిసింగారం సర్పంచ్ వెంకట్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
జవహర్నగర్ : పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన జవహర్నగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగన్న బాల్రాజ్ అన్నారు. మంగళవారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రజాప్రతినిధులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.