మేడ్చల్, జూలై 19 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీల్లోని వైకుంఠ ధామాలను ప్రభుత్వం విస్తరించనున్నది. ఇందుకు కావాల్సిన అదనంగా 20 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు రూ.17 కోట్ల నిధులను మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకల సౌకర్యాలు కల్పించే పనిలో అధికారులు పడ్డారు. వైకుంఠధామాల్లో నీటి సౌకర్యం, స్నానం గదులను ఏర్పాటు చేయనున్నారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటనున్నారు.
మేడ్చల్ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని వైకుంఠధామాల విస్తరణకు ప్రభుత్వం రూ.17 కోట్లు మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి విస్తరణ పనులు ప్రారంభిస్తాం. వైకుంఠధామాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేయిస్తా. -మంత్రి చామకూర మల్లారెడ్డి