మేడ్చల్ రూరల్, మార్చి 14: యువశక్తిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశం పురోభివృద్ధి సాధిస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గుం డ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో ఉన్న సీఎంఆర్ కళాశాల సమావేశ మందిరంలో ఆదివారం స్ట్రీట్ కాస్ అనే సంస్థ ‘రన్ ఫర్ కాస్ 7.0’ అనే 15 గంటల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా జరిగిన సెలబ్రిటీ ప్యానెల్ చర్చా కార్యక్రమాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరై సమాజ పరిస్థితులను చర్చి స్తూ యువతకు దిశా నిర్దేశం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశానికి ప్రపంచంలో అగ్రగామిగా నిలిచే శక్తి ఉందన్నారు. కానీ, పూర్తి స్థాయిలో యువత సన్మార్గంలో నడవడం లేదన్నారు. యువతకు ఉపాధి కల్పించి, వారు పెడదారి పట్టకుం డా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. అం తేకాదు, విద్యా సంస్థలు విద్యార్థులను మార్కుల కొలమానంతో చూడకుండా తమ కాళ్లపై తాము నిలబడే లా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా తెలంగాణ ప్రభు త్వం మెరుగైన పారిశ్రామిక విధానం తీసుకువచ్చి, వారి భవిష్యత్తు దిశగా కృషి చేస్తుందన్నారు.
ప్రకృతిపై ఆధిపత్యం సాధించడం ఎవరి వల్ల సాధ్యం కాదని, కోవిడ్ సంక్షోభ పరిస్థితుల ద్వారా వెల్లడైందన్నారు. ప్రపంచాన్ని అతలాకుతులం చేసి, ఆర్థిక మాంధ్యంలో పడవేసిందన్నారు. ప్రధానంగా రోజువారీ కూలీలు పరిస్థితి అధ్వాన్నంగా మారింది తెలిపారు. ప్రభుత్వా లు ప్రజలను సంక్షోభం నుంచి బయటపడవేయడానికి కృషి చేస్తున్నప్పటికీ సమయం పడుతుందన్నారు. గ్లోబల్ విలేజీగా ప్రపంచం మారిపోయిన సందర్భం లో అన్ని దేశాలు కలిసికట్టుగా సంక్షోభంపై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కొవిడ్ టీకాల గురించి మంత్రి మాట్లాడుతూ, 90 శాతం వరకు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. అంతకు ముందు 5కే రన్, యోగ, జుంబా, క్విజ్ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో రమ్య, మేఘన, చామకూర గోపాల్రెడ్డి, హీరో విశ్వక్సేన్, అఖిల్ సార్థక్, రామ్ మిర్యాల పాల్గొన్నారు.