దుండిగల్,జూన్13: మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో త్రిష్ణ-2021 పేరుతో జాతీయ స్థాయిలో ఆన్లైన్ వేదికగా ఫెస్ట్ నిర్వహించారు. ఈ వేడుకల్లో 4180 మంది కళాశాలలు, పాఠశాలల స్థాయి విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా ఎంఎల్ఆర్ఐటీ కళాశాల కార్యదర్శి, టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు వెలికి తీసేందుకు జాతీయ స్థాయిలో వేడుకలు నిర్వహించామని, ఢిల్లీ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ప్రముఖ గాయకుడు దీపు, ఆర్కే, షేనాయ్ తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధికాదేవి, పార్థు, మధురావాణి,ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.