మేడ్చల్, జూన్14(నమస్తే తెలంగాణ): కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఉదారతను చాటుకున్నారు. మృతదేహాలను ఉంచే ఫ్రీజర్ బాక్సులను సొంతనిధులతో తయారు చేయించి మేడ్చల్ జిల్లాలోని 61 గ్రామాలకు అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మేడ్చల్లో కొన్ని గ్రామలకు సంబంధించి సర్పంచ్లకు ఫ్రీజర్ బాక్సులను అందించారు. జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్వాంసన్, మేడ్చల్ ఎంపీపీ పద్మజగన్రెడ్డి జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.