కీసర, మార్చి 8 : తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 14వ తేదీ వరకు ఆరు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. భక్తులు స్వామిని దర్శించుకోవడానికి సౌకర్యాలను ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్రెడ్డి తెలిపారు.