ఆర్కేపురం :ఇటీవల జరిగిన 20వ జాతీయ, ప్రాంతీయ స్థాయి సిప్ అబాకస్ మెంటల్ అర్థమెటిక్ కంటెస్ట్లో సిప్ అబాకస్ గ్రీన్హిల్స్ కాలనీ, ఎల్బీనగర్ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి 3,800 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా నిర్వహించిన పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో కేవలం 5 నిషాలలో 125 లెక్కలు చేయాల్సివుంటుంది. హోరా హోరిగా సాగిన ఈ పోటీలో మన విద్యార్థులు సత్తా చాటారు.
యం.ఆశ్రీత(లెవెల్ 6) విభాగంలో తెలంగాణ రాష్ట్ర చాంపియన్గా నిల్చింది. యం.బైరవ (లెవెల్ 1) విభాగంలో 2వ రన్నరప్, యం.నయోనిక (లెవల్ 2)లో 1వ రన్నరప్, డి.కార్తీక్ (లెవల్ 3)లో 1వ రన్నరప్, ఏ. రితిక (లెవల్ 6)లో 1వ రన్నరప్, ఏ రిత్విక్ (లెవల్ 8)లో 1వ రన్నరప్, వి.నిఖిల్ (లెవల్ 8)లో 2వ రన్నరప్, బి.ఈషాన్ (జి.యం.సి)లో 1వ రన్నరప్ ట్రోఫిలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విజేతలకు సిప్ అబాకస్ గ్రీన్హిల్స్ కాలనీ, ఎల్బీనగర్ నిర్వాహకులు సంధ్యారాణి విద్యార్థులను అభినందించారు.