Plane Crashes | ఇండియన్ ఎయిర్ఫోర్స్ (India Air Forces)కు చెందిన ఓ గూఢచారి విమానం (spy plane) ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం రాజస్థాన్ (Rajasthan)లోని జైసల్మేర్ (Jaisalmer) జిల్లాలో కుప్పకూలిపోయింది (Plane Crashes). ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. సాధారణ శిక్షణా సమయంలో విమానం ప్రమాదానికి గురైనట్లు తెలిపింది.
జైసల్మేర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధని జాజియా గ్రామంలో ఓ బహిరంగ ప్రదేశంలో విమానం కూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, వైమానిక దళ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ విమానాన్ని ఏఐఎఫ్ నిఘా, గూఢచారి కార్యకలాపాలు నిర్వహించేందుకు వినియోగిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేసినట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ వెల్లడించింది.
One remotely Piloted Aircraft of the Indian Air Force met with an accident near Jaisalmer today during a routine training sortie. No damage to any personnel or property has been reported. A Court of Inquiry has been constituted to find out the cause of the accident: Indian Air… pic.twitter.com/VWYL4q8JZp
— ANI (@ANI) April 25, 2024
Also Read..
Kenya | కెన్యాను ముంచెత్తిన భారీ వర్షాలు.. 38 మంది మృతి
JDU Leader | నితీశ్ కుమార్ పార్టీ నేత దారుణ హత్య
Summer | భానుడి భగభగ.. 28న రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు: ఐఎండీ