మేడ్చల్, జూన్7(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్కు పలు భూ సంబంధిత సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ లోపు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 6వేల దరఖాస్తులు రాగా.. ఇప్పటికే 4,800 పరిష్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో 1200 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. వాటిని పరిష్కరించేందుకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రసుత్తం మ్యుటేషన్లు, భూములకు సంబంధించిన సమస్యలు, డీజిటల్ సంతకం తదితర వాటిపై ధరణి పోర్టల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. పీఓబీలో నమోదైన తప్పుడు వివరాలను సరిచేస్తున్నారు. ఈ నెల 9లోపు పెండింగ్లో ఫిర్యాదులన్నీ పరిష్కారమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.