కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 24 : సైబర్ నేరగాళ్లు అత్యాశ చూపించి.. ఉన్నదంతా దోచేంత వరకు విడిచి పెట్టడం లేదు. అదే కోవకు చెందిన పలు కేసులు శనివారం పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో నమోదయ్యాయి. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న సుచిత్ర బ్యాంకు కాలనీకి చెం దిన వి. వినయ్రెడ్డి(22) ఫోన్కు ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా ట్రేడ్ అఫిషియల్ నుంచి ట్రేడింగ్ ఆన్లైన్లో డబ్బు సంపాదించేందుకు చేస్తున్నానని అని పత్రాలతో కూడిన సందేశం వచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి 9670246674 నంబర్కు రూ. 2000 పేటీఎం ద్వారా పంపివ్వడంతో వెంటనే అతని ఖాతా కు రూ.2,450 వచ్చాయి. దీంతో ఆ వ్యక్తికి రూ. 5000 పంపిస్తే మరింత ఎక్కువ లాభం వస్తుందని ఆశచూపడంతో సదరు వ్యక్తి అదే నంబర్కు మరో రూ. 5వేలు పంపించాడు. తిరిగి రూ. 10వేలకు స్లాట్ ఉందని చెప్పడంతో మరో రూ. 5వేలు అదనంగా పంపించాడు. తరువాత మరో నంబర్ 7763000663 వాట్సాప్ ద్వారా రూ. 20వేలకు స్లాట్ చెప్పడంతో మరో రూ. 10వేలు పేటీఎం ద్వారా చెల్లించాడు. తాను చెల్లించిన దానికి తిరిగి లాభంతో ఇవ్వమని అడిగేందుకు ప్రయత్నం చేయగా అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరకు తాను రూ. 20వేలు మోసపోయానని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మానగర్ఫేస్-2 రింగ్రోడ్ ప్రాంతానికి చెందిన వీరగంటి శ్రీరామ్ రంజిత్కుమార్(31) బాలానగర్లో ఫార్మా లిమెటెడ్లో సీనియర్ అసోషియేట్గా పని చేస్తున్నాడు. మార్చి 31న తనకు సంబంధించిన ఎస్బిఐ క్రెడిట్కార్డుతో పాటు సిటిబ్యాంకు క్రెడిట్కార్డుల ద్వారా తన ప్రమేయం లేకుండా ఎలాంటి ఓటిపి సందేశాలు రాకుం డా తన ఖాతాల నుంచి రూ. 61,400 డెబిట్ అయ్యా యి. ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.