న్యూఢిల్లీ, మే 19: కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా వేసుకోవాలని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొవిడ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల బృందం (ఎన్ఈజీవీఏసీ) చేసిన సిఫార్సులకు బుధవారం ఆమోదం తెలిపింది. వ్యాక్సినేషన్ విధానంలో నూతన మార్గదర్శకాలను అమలుచేయాలని రాష్ర్టాలను ఆదేశించింది.